Anantapur: పదిమంది కోవిడ్ బాధితుల పరిస్థితి విషమం

Anantapur: ఇవాళ హాస్పిటల్‌లో ఇద్దరు కోవిడ్ పేషంట్లు మృతి * ఆందోళనలో పేషంట్ల కుటుంబసభ్యులు

Update: 2021-05-05 11:06 GMT

Representational Image 

Anantapur: అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. ఇవాళ ఇద్దరు కోవిడ్ పేషంట్లు మరణించగా.. మరో పదిమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పేషంట్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హాస్పిటల్‌లో 18 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడి సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స సమయానికి అందక ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

అయితే ఘటనపై వివరణ ఇచ్చిన తహశీల్దార్‌ పేషంట్ల పరిస్థితి విషమం అనే వార్త అవాస్తవమంటున్నారు. ఇద్దరు చనిపోయిన మాట నిజమే కానీ.. మిగతా వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. హాస్పిటల్‌లో కోవిడ్ బాధితులకు వైద్యం అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు.

Tags:    

Similar News