Prakasam: సింగరాయకొండ హైవేపై అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కారు!
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై పెను ప్రమాదం! డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడటంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
Prakasam: సింగరాయకొండ హైవేపై అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కారు!
ప్రకాశం జిల్లా : సింగరాయకొండ జాతీయ రహదారి పై కారు డివైడర్ డీ కొని బోల్తా పడి మంటలో పూర్తిగా దగ్ధమైంది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి తో నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఎటువంటి ప్రాణనష్టం లేదు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపుచేశారు. హైవే పోలీసులు గాయపడిన క్షతగాత్రులను 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.