Bollywood Actors: హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి..పట్టుబడ్డ సెలబ్రిటీలు?

Bollywood Actors: డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించిన ఈగల్ ఫోర్స్ తన ప్రతాపాన్ని చూపింది.

Update: 2026-04-05 04:50 GMT

Bollywood Actors: హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి..పట్టుబడ్డ సెలబ్రిటీలు?

Drug Test: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తరుణంలో, కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక విభాగం 'ఈగల్' తన ప్రతాపాన్ని చూపుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మెరుపు దాడులతో డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక తారామతి రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

గోల్కొండలో అర్ధరాత్రి హైడ్రామా

వీకెండ్ కావడంతో గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్ట్ యువతతో కళకళలాడుతోంది. అక్కడ జాక్ అండ్ జాన్సన్ పేరుతో ఒక హై-ప్రొఫైల్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు కేవలం స్థానిక యువతే కాకుండా, బాలీవుడ్ నుండి కూడా పలువురు నటులు హాజరవ్వడం విశేషం. అయితే, ఈ సందడి వెనుక డ్రగ్స్ వినియోగం జరుగుతోందని ఈగల్ విభాగానికి పక్కా సమాచారం అందింది.

రంగంలోకి ఈగల్..

ముందస్తు సమాచారంతో అత్యంత గోప్యంగా ప్లాన్ చేసిన ఈగల్ అధికారులు, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్‌తో కలిసి రిసార్ట్‌ను చుట్టుముట్టారు. కేవలం సాధారణ తనిఖీలతో సరిపెట్టకుండా, ఆధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. రేవ్ పార్టీలపై నిఘా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ సాయంతో అనుమానితులను గుర్తించారు.

సెలబ్రిటీలకు అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు

రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు ఎవరినీ బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న బాలీవుడ్ సెలబ్రిటీలతో సహా అనుమానితులందరికీ అక్కడికక్కడే డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకప్పుడు డ్రగ్స్ కేసులంటే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపేవారు, కానీ ఇప్పుడు 'ఈగల్' స్క్వాడ్ తక్షణ ఫలితాలను ఇచ్చే కిట్లతో రంగంలోకి దిగడం విశేషం.

ఈ దాడిలో డ్రగ్స్ వినియోగించిన వారు ఎంతమంది? పట్టుబడిన వారిలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను గోప్యంగా ఉంచారు. త్వరలోనే అధికారికంగా వీరి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. పబ్‌లు, ఫామ్‌హౌస్‌లే కాకుండా ఎక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు జరిగినా తమ నిఘా నేత్రం తప్పించుకోలేరని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News