Hyderabad: ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపు.. చెంప చెల్లుమనిపించిన మహిళ

Hyderabad: ఇళ్లు ఇప్పిస్తానని చెప్పాడు లక్షల సొమ్ము కాజేశాడు నిలదీస్తే ఫోటోలు వైరల్ చేస్తానని ఓ మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు.

Update: 2021-04-12 09:00 GMT

Hyderabad: ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరింపు.. చెంప చెల్లుమనిపించిన బాధిత మహిళ

Hyderabad: ఇళ్లు ఇప్పిస్తానని చెప్పాడు లక్షల సొమ్ము కాజేశాడు నిలదీస్తే ఫోటోలు వైరల్ చేస్తానని ఓ మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఫతేనగర్‌‌లో జరిగింది.

బాలానగర్‌ కార్పొరేటర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే సయ్యద్ అహ్మద్‌ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో కొన్నాళ్లు సన్నిహితంగా గడిపాడు. ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి పది లక్షలు వసూలు చేశాడు. అయితే ఇల్లు రాకపోవడంతో అహ్మద్‌ను నిలదీసింది మహిళ. దాంతో అహ్మద్ తన దగ్గర ఉన్న ఆ మహిళ ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె కార్పొరేటర్ కార్యాలయంలోనే చెప్పుతో అహ్మద్ చెంప చెల్లుమనిపించింది.

విషయం తెలిసిన కార్పొరేటర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా అహ్మద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసారు. మహిళపై కూడా 324 కేసును నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags:    

Similar News