Hyderabad: అధికారులకు చుక్కలు చూపించిన కరోనా పేషెంట్

Hyderabad: అసలే ఒమిక్రాన్ భయంతో వణుకుతున్న ప్రజలకి కరోనా పేషెంట్స్ ప్రవర్తన మరింత ఆందోళన పెంచుతోంది.

Update: 2021-12-03 10:19 GMT

Hyderabad: అధికారులకు చుక్కలు చూపించిన కరోనా పేషెంట్

Hyderabad: అసలే ఒమిక్రాన్ భయంతో వణుకుతున్న ప్రజలకి కరోనా పేషెంట్స్ ప్రవర్తన మరింత ఆందోళన పెంచుతోంది. నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్రిటన్ నుంచి వచ్చిన 36 ఏళ్ల కరోనా పేషెంట్ టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తప్పించుకుని ఇంటికెళ్లిపోయింది. కుత్బుల్లాపూర్లోని గణేష్ నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్ కు చేరుకుంది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు ఆమె పాస్ పోర్ట్ ఆధారంగా వివరాలను జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తెలిపారు.

వెంటనే పోలీసులు, వైద్యాధికారులు రిడ్జ్ టవర్స్ లోని ఆమె ఇంటికి చేరుకోగా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అధికారులు, అసోసియేషన్ సిబ్బంది అందరూ కలసి వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లి దండ్రులను కూడా ఐసోలేషన్ కు తరలించారు.

Tags:    

Similar News