ఫలితాలు బాధ్యతను పెంచాయి: కేటీఆర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంపై రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కె. తారక రామారావు స్పందించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంపై రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కె. తారక రామారావు స్పందించారు. 2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రకటించారు. పురపాలక మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారు అని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించడం గొప్ప విషయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
My heartfelt gratitude to the people of Telangana for reposing faith in Sri KCR Garu's leadership again & giving us a thumping victory in Municipal elections 🙏 🙏🙏
— KTR (@KTRTRS) January 25, 2020
Winning more than 100 plus municipalities out of 120 and all 9 out of 9 municipal corporations is no mean feat 👍 pic.twitter.com/sKIA0D71GU