Revanth Reddy: నేడు 3 నియోజకవర్గాల్లో రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం
Revanth Reddy: ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్
Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. క్యాంపెయిన్లో భాగంగా.. ఇవాళ సీఎం రేవంత్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నంలో రేవంత్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్లో రోడ్షో.. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్లో రేవంత్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు.