Etela Rajender: బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నీచపు ప్రచారం చేస్తుంది
Etela Rajender: కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలను ప్రజలను మోసం చేసింది
Etela Rajender: కాంగ్రెస్పై మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలను ప్రజలను మోసం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నీచపు ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు తీసివేయలేదని ఆయన అన్నారు. అణగారిన వర్గాలకు బీజేపీ పార్టీ పదవులు కట్టబెట్టిందన్నారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలిచి కాషాయ జెండాను ఎగురవేస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.