టీఎన్జీవోల మీట్ రద్దు..ఎందుకంటే..?

Update: 2019-10-17 08:01 GMT

ఇవాళ జరగాల్సిన టీఎన్జీవోల సమావేశం రద్దైంది. ఆర్టీసీ సమ్మెతో పాటు తమ సమస్యలపై చర్చించేందుకు సమావేశం కావాలనుకున్న టీఎన్జీవోలు అర్ధాంతరంగా సమావేశాన్ని రద్దు చేశారు. నేరుగా సీఎస్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పదే పదే సమావేశమైతే అభిప్రాయబేదాలొస్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్జీవోలు తెలిపారు. ముఖ్యంగా 15 ప్రధానమైన డిమాండ్లపై సీఎస్‌కు వినతిపత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల తీర్మానాలను జేఏసీ తరపున వినతిపత్రం ఇస్తామని టీఎన్జీవో నేతలు తెలిపారు.

Full View 

Tags:    

Similar News