రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ దడ పుట్టిస్తోంది. ఒక వైపు విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో వైపు స్వైన్ ఫ్లూ అటాక్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృభిస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రాలేదని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ అంటున్నారు.
స్వైన్ ఫ్లూ ప్రచారంలో ఉన్నంత ఎక్కువగా లేదని, ఇవన్నీ ప్రజలని భయందోళనలకు గురిచేసే ఫేక్ వార్తలేనంటున్నారు.