Shilpa Chowdary: పోలీసుల విచారణలో బోరున విలపించిన శిల్ప

Shilpa Chowdary: కోట్లాది రూపాయలు ఎగ్గొటిన శిల్పా చౌదరి కేసులో మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది.

Update: 2021-12-03 13:33 GMT

Shilpa Chowdary: పోలీసుల విచారణలో బోరున విలపించిన శిల్ప

Shilpa Chowdary: కోట్లాది రూపాయలు ఎగ్గొటిన శిల్పా చౌదరి కేసులో మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. నార్సింగ్ పోలీసుల విచారణలో శిల్పా బోరున విలపించినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శిల్పాను విచారించిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. శిల్పా బినామీలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లపై పోలీసులు ఆరా తీసిన పోలీసులు కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించింది అన్న కోణంలో ప్రశ్నలు కురిపించారు. అయితే, తనకు డబ్బులు ఇచ్చిన వారంతా అప్పుగానే ఇచ్చినట్లు చెప్పిన శిల్పా కొందరు మాత్రం బ్లాక్‌ను వైట్‌గా మార్చేందుకు ఇచ్చినట్లు చెప్పినిట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News