రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంకానుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాలని కోరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే అధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తమకు పోటీయే కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్.