కేంద్ర కేబినెట్‌ సచివాలయంలో ఉప కార్యదర్శిగా ఆమ్రపాలి

Update: 2019-10-29 06:15 GMT

యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్నారు. అమ్రపాలి కేంద్ర కేబినెట్‌ సచివాలయంలో ఉప కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల పాటు ఆమె పదవిలో కొనసాగనున్నారు.

ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గానూ పనిచేశారు. 

Tags:    

Similar News