హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్

Update: 2020-06-01 07:05 GMT
Representational Image

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 199 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు బీజేపీ శ్రేణులు. బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ కరోనా రావడంతో.. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ తేలింది. దీంతో వెంటనే వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News