Madhu Yashki: కేసీఆర్ కు వ్యతిరేకంగానే దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా

Madhu Yashki: కేసీఆర్ అరాచక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి అన్నారు.

Update: 2021-08-07 14:32 GMT

Madhu Yashki: కేసీఆర్ కు వ్యతిరేకంగానే దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా

Madhu Yashki: కేసీఆర్ అరాచక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఉంటే దళిత, గిరిజనులు ఆత్మగౌరవం తో ఉండేవారు మూడెకరాల భూమి ,ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని మధుయాష్కి విమర్శించారు.

ఉద్యోగ కల్పన జరిగి ఉంటే ఇప్పుడు దళిత బంధు పేరుతో పది లక్షలు పంచాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంపదతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారని మధు యాష్కి విమర్శించారు. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకు అతీతంగా అందరూ తరలి రావాలని మధు యాష్కి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News