Bandi Sanjay: పెన్షన్లకు లేని పైసలు.. మూసీకి ఎక్కడివి? రేవంత్ రెడ్డిని నిలదీసిన బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించారు.

Update: 2026-03-09 08:47 GMT

Bandi Sanjay: పెన్షన్లకు లేని పైసలు.. మూసీకి ఎక్కడివి? రేవంత్ రెడ్డిని నిలదీసిన బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు అసలు పొంతన లేదని, రోజుకో రకంగా ఆయన ప్రకటనలు మారుతున్నాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెండింగ్ సమస్యలను పక్కనపెట్టి, కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

నిధులు లేవంటారు.. వేల కోట్లు ఎక్కడివి?

రాష్ట్ర ప్రభుత్వ వైరుధ్యాలను ఎండగడుతూ బండి సంజయ్ పలు ప్రశ్నలు సంధించారు.

ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు ఇచ్చేందుకు భూమి లేదని చెబుతూనే.. మరోవైపు జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంతాల వారికి భూమి ఇస్తామని హామీలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

పెన్షన్లు క్లియర్ చేయడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఓవైసీ ఒక్క పిలుపు ఇవ్వగానే మూసీ ప్రాజెక్ట్ కోసం వేల కోట్ల రూపాయలను ఎలా సమీకరిస్తోందని నిలదీశారు.

కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి.. ఇప్పుడు అమ్మాయిలకు ఉచితంగా ఈవీ (EV) స్కూటీలు ఇస్తామంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు.

కాంగ్రెస్ అంటేనే 'దోమల' పాలన!

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ ఒక సెటైరికల్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో దోమల సమస్య పెరిగిందన్న సీఎం మాట నిజమేనని, అయితే ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నా.. కాంగ్రెస్ పార్టీ దోమల మాదిరిగానే వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కంటే అవినీతి, హామీల కంటే వేధింపులే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News