Hyderabad: ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న అతివేగం

Hyderabad: ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Update: 2022-12-25 09:31 GMT

ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న అతివేగం 

Hyderabad: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బైక్‌పై అతివేగంగా హైదరాబాద్‌ గండిమైసమ్మ వైపు నుంచి షాపూర్‌నగర్ వెళ్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పిన బైకు ఓ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతి అనే యువకుడు స్పాట్‌లోనే మృతిచెందగా సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News