సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

అనారోగ్య సమస్యతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది.

Update: 2019-10-15 05:00 GMT

అనారోగ్య సమస్యతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే  హైదరాదాబ్ నగరంలోని చందానగర్‌లో నివాసముంటున్న రఘురాం(35), ఆయన భార్య శ్రీదేవి గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటినుంచి బయటకు వెళ్ళిన రఘురాం కంపెనీ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యే రఘురాం ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు..

Tags:    

Similar News