రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైడ్ స్ర్పే చేయాలని అధికారులకు సూచించారు.

Update: 2021-04-17 14:20 GMT

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైడ్ స్ర్పే చేయాలని అధికారులకు సూచించారు. అన్ని పురపాలికల్లో వెంటనే శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలన్న మంత్రి ఫ్రంట్ లైన్ సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీలో రేపటికల్లా వందశాతం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది అని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.

Tags:    

Similar News