Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డికి షాక్‌

Update: 2020-01-25 06:47 GMT

కొడంగల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డికి షాక్‌ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరాభవం పొందారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థులు కూడా పరాభవం పొందారు. కేవలం మూడు వార్డులతోనే కాంగ్రెస్ సరిపెట్టుకుంది.

కొడంగల్‌ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 

Tags:    

Similar News