ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలో స్వయంగా సర్పంచ్ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తానే స్వయంగా స్ప్రే పంపును భుజాన వేసుకొని.. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. అనంతరం మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. తమ గ్రామానికి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెబుతున్నారు ఆగ్రామ సర్పంచ్ విజయ అశోక్ రెడ్డి.