హుజూర్నగర్ ఎమ్మెల్యేగాగా శానంపూడి సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇటివల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి పై 43 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.