Hyderabad: హైదరాబాద్ లో మరో ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయిన కారు

Update: 2020-02-18 01:36 GMT

గచ్చిబౌలి బయో వర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ కారు కింద పడి.. ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మరవక ముందే.. హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భరత్‌ నగర్‌ లో కారు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. మూసాపేట నుంచి సనత్‌నగర్‌ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది.

కారు నుజ్జు నుజ్జు కావడంతో.. ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగిందో అంచనా వేయొచ్చు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా గచ్చిబౌలి బయో వర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ కారు కింద పడటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. అప్పట్లో ఈ ఘటనతో దాదాపు 42 రోజులపాటు ఈ దారిని మూసి వేశారు. తిరిగి జనవరి 2 తారీఖున వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 

Tags:    

Similar News