Mahabubabad: మెడికల్ షాపుల్లో రెవెన్యూ అధికారుల తనిఖీలు
జిల్లాలో ఉన్న 16 మండలాల్లోని మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు.
మహబూబాబాద్:జిల్లాలో ఉన్న 16 మండలాల్లోని మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు.జిల్లాలో ఉన్న 16 మండలాల్లోని మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ అధికారులు, సిబ్బంది జిల్లా పరిధిలోని మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజలకు మెడిసిన్స్ అందుబాటులోఉంటున్నాయా లేదా... కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా షాపుల్లో మాస్కులు అమ్మడంపై ఆరా తీశారు. కేసముద్రం తహశీల్దార్ వెంకట్ రెడ్డి మండలంలో పలుషాపుల్లో తనిఖీలు చేపట్టి... ప్రజలకు మాస్కులు అందుబాటులో ఉంచాలని కోరారు.