Pradeep Eshwar: మంత్రికి సవాల్.. కర్ణాటకలో పథకాల అమలుపై చర్చకు రావాలి
Pradeep Eshwar: కర్ణాటక పథకాలపై తెలంగాణలో దుష్ప్రచారం చేస్తున్నారు
Pradeep Eshwar: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బహిరంగ సవాల్ విసిరారు. కర్ణాటక పథకాలపై తెలంగాణలో దృష్పచారం చేస్తున్నారని అన్నారు. పధకాల అమలుపై కర్ణాకలోని ఏ గ్రామానికైనా రావాలని సవాల్ విసిరారు. బుధవారం మధ్యాహ్నం 12గంటలకు వేల్పూర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి చాలెంజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో పథకాలు అమలు చేస్తామని అంటున్న కర్ణాటకలోని చిక్ బల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్.