Telangana: తెలంగాణలోని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా

Telangana: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసిన వర్సిటీలు

Update: 2022-01-18 01:35 GMT

 తెలంగాణలోని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా

Telangana: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రస్మా డిమాండ్‌ చేసింది.

ఈ మేరకు ట్రస్మా ప్రతినిధులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుసుకుని వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థలను వెంటనే పున:ప్రారంభించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రెడ్డి కూడా డిమాండ్‌ చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే సర్కారు సెలవులు ప్రకటించిందని పీడీఎస్‌యూ ఆరోపించింది.

Tags:    

Similar News