కాంగ్రెస్ నేత హనుమంతరావు పై కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. లాక్ డౌన్ ను ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి హనుమంతరావు పులమాల వేశారని పోలీసులు తెలిపారు. కరోనా వ్యాధి నివారించేందుకు లాక్డౌన్ అమలు చేస్తుంటే దానిని వీహెచ్ ఉల్లంఘించారని ఆరోపించారు. హనుమంతరావు పై 188,269 సెక్షన్ కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. ప్రజలు ఎవ్వరు అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ కు రావొద్దని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ట్యాంక్ బండ్ పైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.