PM Modi: తెలంగాణను దోచుకున్న వారిని మేం వదిలిపెట్టం.. ఇది మోడీ గ్యారెంటీ
PM Modi: మాకు అధికారం కంటే ప్రజాసంక్షేమమే ముఖ్యం
PM Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని...ఈ రెండు పార్టీలు తనను దూషించడమే పనిగా పెట్టుకున్నాయని ప్రధాని ఆరోపించారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత కవర్ ఫైర్ చేసినా...తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టమని...ఇది మోడీ గ్యారెంటీ అని సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్..లిక్కర్ స్కామ్లోనూ కమీషన్లు తీసుకుందని..తెలంగాణ నుండి ఢిల్లీ వరకూ వారి అవినీతి కొనసాగిందని ప్రధాని మోడీ అన్నారు.