Telangana: తెలంగాణలో మరోసారి IAS అధికారుల బదిలీలు

Telangana: సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను బదిలీ చేసిన సీఎస్

Update: 2024-02-23 09:29 GMT

Telangana: తెలంగాణలో మరోసారి IAS అధికారుల బదిలీలు 

Telangana: తెలంగాణలో మరోసారి IAS అధికారుల బదిలీలు జరిగాయి. పలువురు IAS అధికారులకు స్థానచలనం కల్పించారు. సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను బదిలీ చేస్తూ.. నీటిపారుదల శాఖ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్‌‌గా మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్‌గా ఉన్న షేక్ రిజ్వాన్‌ పాషాను జనగామ కలెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం జనగామ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివలింగయ్యను G.A.D రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరితో పాటు శైలజా రామయ్యర్‌ను దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నియమిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News