MP Navneet Kaur Rana: 15 సెకన్లు చాలు.. ఒవైసీ సోదరులకు నవనీత్‌ కౌర్ వార్నింగ్..

Navneet Kaur Rana: తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Update: 2024-05-09 09:15 GMT

MP Navneet Kaur Rana: 15 సెకన్లు చాలు.. ఒవైసీ సోదరులకు నవనీత్‌కౌర్ వార్నింగ్..

Navneet Kaur Rana: తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈసారి తెలంగాణలో 17 సీట్లకు గాను డబుల్ డిజిట్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఇందులో భాగంగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బీజేపీ నేతలను రంగంలోకి దించుతోంది. తెలుగువారికి సుపరిచితమైన, టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నేత నవనీత్ కౌర్ బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో నవనీత్ కౌర్ ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన నవనీత్ కౌర్..2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 15 నిముషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు..కానీ వాళ్లకు 15 నిముషాలేమో...మాకు 15 సెకన్లు చాలు అని నవనీత్ కౌర్ సవాల్ చేశారు.

Tags:    

Similar News