ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు..!

Update: 2020-01-27 07:26 GMT
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు

ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్‌ , కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీపీఎం కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  

Tags:    

Similar News