Kamareddy: కామారెడ్డి అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్
KTR: సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి
KTR: ప్రభుత్వం సాయం చేసేందుకే ఉంది
Kamareddy: కామారెడ్డి అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంలో రైతులు వర్సెస్ కలెక్టర్ అన్నట్లుగా వివాదం ముదురుతోంది. కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని రైతులు పట్టు పడుతున్నారు. రైతులను కలిసేందుకు అధికారులుగాని.. కలెక్టర్ సుముఖత చూపడంలేదు. అధికారుల పంతంతో కలెక్టరేట్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కామారెడ్డి అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ఎందుకు చర్చించలేకపోతున్నారని ఫైరయ్యారు. రైతుల ఆందోళనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు కేటీఆర్.