Jagadish Reddy: పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర.. ఆ రెండు పార్టీలదే

Jagadish Reddy: బీఆర్‌ఎస్‌కు శాశ్వత శత్రువులు లేరు

Update: 2023-08-09 09:36 GMT

Jagadish Reddy: పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర.. ఆ రెండు పార్టీలదే

Jagadish Reddy: టీపీసీసీ చేర్మెన్ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే అని ఆరోపించారు. రేవంత్ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. రేవంత్ లాంటి సంస్కార హీనున్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌కు పిండం పెట్టడం గురించి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకు కేసిఆర్ కు పిండం పెడతావా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి శాశ్వత శత్రువులు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News