సీఎం కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

Update: 2019-09-08 09:16 GMT

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. గవర్నర్ తమిళిసై‌కు స్వాగతం పలికిన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు ఈటల వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ఈటలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చర్చలు జరపడం ఆసక్తిని రేపుతోంది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో యూరియా సమస్యతో పాటు జ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు సైతం వణికిస్తున్నందున దీనిపైనే చర్చించినట్టుగా కూడా సమాచారం.

Tags:    

Similar News