భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

Update: 2019-09-21 10:37 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అన్నారుపాడు గ్రామానికి చెందిన గోపీచంద్‌, అదే గ్రామానికి చెందిన సింధు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీళ్ల ప్రేమను ఇరు కుటుంబాలు కాదంటారనే భయంతో గత రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అనంతరం పొల్లాల్లోకి వెళ్లి పురుగులు మందు సేవించారు.

పొల్లాల్లో జీవచ్ఛవంలా పడున్న ప్రేమికులను చూసిన స్థానికులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు పొల్లాల్లోకి వెళ్లి చూడగానే అప్పటికే ఇద్దరు మృతిచెందారు. మృతదేహాలను గ్రామానికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News