ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్యం విషమం

Update: 2019-11-12 07:09 GMT

కాచిగూడలో రైలు ప్రమాదంలో గాయపడిన ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పలు చోట్ల ప్రాక్చర్ అయినట్లు స్కానింగ్ రిపోర్ట్ లో తేలింది. చంద్రశేఖర్ పక్కటెముకలు విరిగినట్లు తెలిసింది. సిటీ స్కాన్ రిపోర్టు ఆధారంగా చంద్రశేఖర్ కు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఇటు దక్షిణమద్య రైల్వే శాఖ అధికారులు కేర్ హస్పిటల్ చేరుకుంటున్నారు. 

Tags:    

Similar News