ఈరోజు నుంచి తెలంగాణాలో తెరుచుకోనున్న వైన్ షాపులు : నిబంధనలు ఇవే!

తెలంగాణా ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో వైన్ షాపుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు పలు నిబంధనలను ప్రభుత్వం పొందు పరిచింది.

Update: 2020-05-06 02:27 GMT
Guide lines for wine shops in Telangana (rep.image)

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈరోజు నుంచి మద్యం అమ్మకాలను తెలంగాణా ప్రభుత్వం ప్రారంభిస్తుందని నిన్నరాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపద్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. 

తెలంగాణా ప్రభుత్వం  మద్యం  అమ్మకాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో వైన్ షాపుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు పలు నిబంధనలను ప్రభుత్వం పొందు పరిచింది. దీని ప్రకారం..

- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వైన్ షాపులు తెరిచి ఉంచాలి.

- బార్లు, పర్మిట్ రూంలు, రెస్టారెంట్లకు అనుమతి ఉండదు.

- ప్రతి మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించాల్సిందే.

- ప్రతి మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించాలనీ, మాస్క్ లు విధిగా ధరించాలనీ బోర్డులు పెట్టాలి.

- వైన్స్ షాపుల వద్ద ఆరు అడుగుల దూరంతో సర్కిల్స్ మార్క్ చేయాలి.

- వైన్ షాపుల యజమానులు, వర్కర్ లు విధిగా మాస్క్ లు ధరించాలి. 

- పబ్లిక్ ప్లేసులలో ఎట్టిపరిస్తితుల్ల్లోనూ మద్యం సేవించకూడదు.



 



Tags:    

Similar News