Kishan Reddy: స్వప్నలోక్ ఘటన దురదృష్టకరం
Kishan Reddy: సికింద్రాబాద్ స్వప్నలోక్ ఘటనాస్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. స్వప్నలోక్ ఘటన దురదృష్టకరమని.. నగరంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. చర్యలు మాత్రం శూన్యమన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్నవాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జనావాసాల మధ్య ఉంటే కాంప్లెక్స్లను అధికారులు తరచూ పర్యవేక్షించాలని.. ప్రమాదాల నివారణకు కనీస సౌకర్యాలు కూడా ఉండటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్లో సిబ్బందిని పెంచి, కేంద్రాలు పెంచాలన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్కు అత్యాధునిక పరికరాలు సమకూర్చాలన్నారు.