Kishan Reddy: మోదీ చరిష్మా ముందు కాంగ్రెస్ గారడీలు పనిచేయవు

Kishan Reddy: 17 ఎంపీ స్థానాల్లో బలమైన పోటీ ఇస్తాం

Update: 2024-02-07 03:36 GMT

Kishan Reddy: మోదీ చరిష్మా ముందు కాంగ్రెస్ గారడీలు పనిచేయవు

Kishan Reddy: మోదీ చరిష్మా ముందు కాంగ్రెస్ గారడీలు పనిచేయవన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహేశ్వరం మండలం ఆమీర్‌పేట్‌లో చేపట్టిన గావ్ ఛలో- బస్తీ ఛలో కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన లభిస్తుందన్న కిషన్ రెడ్డి.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు. 17 ఎంపీ స్తానాల్లో బలమైన పోటీ ఇస్తామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగొచ్చన్న కిషన్ రెడ్డి.. కార్యకర్తలు, నేతలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

Tags:    

Similar News