తెలంగాణలోనూ కిసాన్ గణతంత్ర పరేడ్
* ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్లో ర్యాలీ * ఆల్ ఇండియా కిషన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ర్యాలీ * ర్యాలీ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి
ల్లీలో జరిగే రైతుల ఆందోళనకు మద్దతుగా ఆల్ ఇండియా కిషన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోనూ కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహించనున్నారు. అందుకోసం హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ర్యాలీ జరగనుంది.