కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెక్యూరిటీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు. తన ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి నిన్న ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.