ఆ వదంతులు నమ్మొద్దు: మెట్రో ఎండీ

Update: 2020-10-14 12:34 GMT

హైదరాబాద్ మెట్రోపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మెట్రో ఎండీ అన్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్‌ కింద రహదారి కుంగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో పిల్లర్‌ వద్ద కూడా భూమి కుంగి ఆ గుంతల్లోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. మెట్రో పిల్లర్లకు, మెట్రో స్ట్రక్చర్ కు ఎలాంటి ప్రమాదం లేదని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో నిర్మాణం సురక్షితంగా ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మెట్రో ఎండీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News