నిమ్స్ ఆస్పత్రిలో కలకలం
-నర్సు నిర్మల ఆత్మహత్యాయత్నం -బ్లేడ్తో గొంతు, చేతులు కోసుకున్న నిర్మల -పదోన్నతులు కల్పించడంలో అన్యాయం చేశారంటూ ఆవేదన
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కలకలం రేగింది. నర్సుగా పనిచేస్తున్న నిర్మల ఆత్మహత్యాయత్నం చేశారు. బ్లేడ్తో గొంతు, చేతులు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను అదే ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పదోన్నతులు కల్పించడంతో ఉన్నతాధికారులు అన్యాయం చేశారంటూ ఆవేదనతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు.