SRSP: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్‌‌కు భారీగా వరద నీరు

SRSP: 24 గేట్లు ఎత్తి దిగువనకు నీరు విడుదల

Update: 2021-09-23 05:45 GMT

శ్రీరాంసాగర్ కు పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

SRSP: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్‌కు వరద నీరు వచ్చి చేరింది. దాంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు 24గేట్లను ఎత్తి 99 వేల 840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1,090 అడుగులు, 89 టీఎంసీలు నీటిసామర్థ్యం ఉంది.

Full View


Tags:    

Similar News