జస్టిస్ ఫర్ దిశ కేసులో విచారణ వేగవంతం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు దిశగా రాష్ట్ర న్యాయశాఖ కసరత్తు చేస్తునట్టు తెలుస్తోంది. ఒక జిల్లా కోర్టుకు స్పషల్ కోర్టు హోదా ఇస్తూ మరికాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.