Medchal: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
Medchal: ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన సులోచన
Medchal: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
Medchal: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన మేడ్చల్ మండలంలో జరిగింది. మండల పరిధిలోని రాజ బొల్లారం గ్రామానికి చెందిన సులోచనకు, మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు నెలలు నిండడంతో పంచాయతీ పరిధిలో ఘనపూర్ లో ఉన్న మెడిసిటీ హాస్పిటల్లో చేర్చారు. ఆమె ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లలు బరువు తక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.