బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి
*కాంగ్రెస్లో చేరిన జడ్పీటీసీలు శ్రవణ్ రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి
Congress: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి హస్తం గూటికి చేరారు. కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంప్లో రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రతాప్రెడ్డితో పాటు కేశంపేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాం రెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.