Roshaiah: మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) సోమవారం ఉదయం కన్నుమూశారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విషాదాన్ని నింపింది. పలువురు రాజకీయ నాయకులు శివలక్ష్మీ మృతిపై సంతాపం తెలిపారు.