Bandi Sanjay Kumar: పంజాగుట్ట దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay Kumar: సోమనాథ్ ఆలయ చరిత్ర, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి కృషి చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Bandi Sanjay Kumar: పంజాగుట్ట దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay Kumar: సోమనాథ్ ఆలయ చరిత్ర, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి కృషి చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
సోమనాథ్ స్వాభిమాన పర్వ్–2026 సందర్భంగా హైదరాబాద్ పంజగుట్టలోని దుర్గ భవాని ఆలయాన్ని ఆయన సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, ఈ ఆలయాన్ని రక్షించేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు.
ఆ మహానీయుల త్యాగాలను స్మరించుకునేందుకే సోమనాథ్ స్వాభిమాన పర్వ్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.