గోల్కొండలో సివిట్ క్యాట్...
లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రాకపోవడంతో అడవులు, జూపార్కులలోని జంతువులన్నీ రోడ్లపై, ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి.
లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రాకపోవడంతో అడవులు, జూపార్కులలోని జంతువులన్నీ రోడ్లపై, ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. నెమలులు, చిరుతలు, జింకలు, కుందేళ్లు ఇలా జంతువులన్నీ కాలనీల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని గోల్కోండ వద్ద ఉన్న మసీదులోకి నలుపు రంగులోని ఓ పెద్ద పిల్లి వచ్చి చేరుకుంది. గోల్కొండలోని నూరానీ మసీదు సమీపంలోని ఫతే దర్వాజా వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక 2-3 గంటల సమయంలో పెద్ద పిల్లి కనిపించింది. అది గమనించిన స్థానికులు నల్ల చిరుత పులి వచ్చందంటూ భయాందోళన గురయ్యారు. దీంతో గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో బ్లాక్ పాంథర్ తిరుగుతోందంటూ ప్రచారం కొనసాగింది.
ఈ సమాచారాన్ని స్థానికులు, పోలీసులు అటవీశాక సిబ్బందికి ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే మసీదు గేట్లను మూసివేశారు. ఎట్టకేలకు అటవీశాఖ సిబ్బంధి మానుపిల్లిని పట్టుకున్నారు. ఆ తరువాత దాన్ని ప్రాథమికంగా పరిశీలించి అది పెద్ద పిల్లిగా తేల్చారు. తగిన రక్షణ చర్యలు తీసుకుని మానుపిల్లిని జూపార్క్కు తరలించినట్లు తెలిపారు. తెలంగాణలో నల్ల చిరుత లేదని, స్థానికులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.